#Uncategorized

KTR’- చేసిన వ్యాఖ్యలను నన్నపనేని రాజకుమారి

హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి కృషి చేసిన చంద్రబాబును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు ఆందోళనలు చేపడుతున్న విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తెదేపా సీనియర్‌ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఖండించారు. ఏదైనా సమస్య ఉత్పన్నమైనపుడు నిరసన తెలిపే హక్కు దేశంలో ఎక్కడివారికైనా ఉంటుందన్నారు. ప్రపంచంలో వివిధ చోట్ల నిరసనలు చేసినట్లే హైదరాబాద్‌లోనూ చేశారని పేర్కొన్నారు. తెరాసను భారాసగా మార్చి వారు ఆంధ్రప్రదేశ్‌లో కార్యక్రమాలు నిర్వహించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఒంగోలులో బుధవారం చేపట్టిన నిరాహార దీక్షా శిబిరం వద్ద ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *