#Uncategorized

Alert messages- దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్‌లో అలర్ట్‌

దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్‌లో అలర్ట్‌ మెసేజ్‌ రావడం కలకలం సృష్టించింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్‌ సౌండ్‌ రావడంతో​ కస్టమర్ల ఆందోళనకు గురయ్యారు. అయితే, టెస్టింగ్‌లో భాగంగానే ఇలా అలర్ట్‌ మెసేజ్‌ పంపినట్టు కేంద్రం వివరణ ఇచ్చింది. 

అయితే, దేశవ్యాప్తంగా గురువారం ఉదయం 11-12 గంటల మధ్య ప్రాంతంలో సెల్‌ఫోన్లకు వార్నింగ్‌ మెసేజ్‌ వచ్చింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్‌ సౌండ్‌ చేస్తూ స్క్రీన్‌పై మెసేజ్‌ డిస్‌ప్లే అయ్యింది. ఈ అలర్ట్‌పై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్‌ విభాగం ద్వారా సెల్‌ ప్రసారం సిస్టమ్‌ ద్వారా పంపంబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి.

ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్‌ డిజాస్టర్‌ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న టెస్ట్‌ పాన్‌ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్‌ వ్యవస్థకి పంపబడింది. దీన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా భద్రత మరియు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందిస్తాయి అని తెలిపింది. 

కాగా, ఈ మెసేజ్‌ ఇప్పటి వరకు మూడు భాషల్లో యూజర్లకు వచ్చింది. మొదట ఇంగ్లీష్‌, తర్వాత తెలుగు, చివరగా హిందీలో మెసేజ్‌లు వచ్చాయి. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *