Delhi and Hyderabad cities went dark for an hour today.. Do you know why..? ఇవాళ గంటపాటు చీకట్లోకి ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు.. ఎందుకో తెలుసా..?

ఎర్త్ అవర్కు సర్వం సిద్ధమైంది.. మరికొన్ని గంటల్లో దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు ఓ గంటపాటు చీకట్లో ఉండనున్నాయి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) అనే సంస్థ ప్రతి సంవత్సర ఒకసారి ‘ఎర్త్ అవర్’.. కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా.. ఎప్పటిలాగే ఈసారి కూడా శనివారం (మార్చి 23న) రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ కార్యక్రమం జరగనుంది
ఎర్త్ అవర్కు సర్వం సిద్ధమైంది.. మరికొన్ని గంటల్లో దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు ఓ గంటపాటు చీకట్లో ఉండనున్నాయి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) అనే సంస్థ ప్రతి సంవత్సర ఒకసారి ‘ఎర్త్ అవర్’.. కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా.. ఎప్పటిలాగే ఈసారి కూడా శనివారం (మార్చి 23న) రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ కార్యక్రమం జరగనుంది.. ఢిల్లీతోపాటు హైదరాబాద్ నగరంలో ఎర్త్ అవర్ను పాటించనున్నారు. దీనికోసం అందరూ లైట్లను ఆపి ఎర్త్ అవర్ కార్యక్రమానికి మద్దతు తెలపనున్నారు.
ఎర్త్ అవర్ సమయంలో.. కమ్యూనిటీలు, వ్యాపారులంతా భూమి పట్ల నిబద్ధతకు చిహ్నంగా లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఒక గంట పాటు ఆఫ్ చేయాలని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సభ్యులు పలు ప్రాంతాల్లో అవగాహన కల్పించారు రాత్రి ఎనిమిదిన్నర నుంచి ఒక గంటసేపు లైట్లు ఆర్పాలంటూ పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు పిలుపు నిచ్చాయి. అంతేకాకుండా.. ప్రభుత్వ సంస్థలు కూడా ఎర్త్ అవర్ ను పాటించనున్నాయి.
పర్యావరణ సమస్యలు, రోజువారీ విద్యుత్ వినియోగం యొక్క ప్రభావం గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా ఎర్త్ అవర్ ను నిర్వహిస్తారు. ప్రపంచ వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో ఈ చొరవ ముఖ్యమైనది.. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సింబాలిక్ లైట్స్ అవుట్ కార్యక్రమంగా ప్రారంభమైన ఎర్త్ అవర్ ను 190కి పైగా దేశాల్లో పాటిస్తున్నారు. ఇది క్రమంగా ప్రపంచ ఉద్యమంగా మారింది.
ఈ ఎర్త్ అవర్ లో భాగంగా సందర్భంగా హైదరాబాద్, ఢిల్లీ నగరంలోని ఐకానిక్ కట్టడాలన్ని చీకటిగా మారనున్నాయి. హైదరాబాద్ నగరంలోని సచివాలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, హుస్సేన్సాగర్లోని బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, చార్మినార్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీతో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఐకానిక్ స్మారక చిహ్నాలు వద్ద రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు వెలుగుల్లో కాకుండా చీకట్లో ఉండనున్నాయి. ఈ ఎర్త్ ఆవర్లో చాలా మంది నగరవాసులు కూడా పాల్గొని ఇళ్లలోని లైట్లు, ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆర్పేసి మద్దతు తెలపనున్నారు. దీంతో.. నగరమంత ఆ గంటపాటు చీకటి మయంగా మారనుంది.
కాగా.. ఢిల్లీలో కూడా ప్రజలు ఈ ఎర్త్ అవర్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గతేడాది.. ఢిల్లీలో పాటించిన ఎర్త్ అవర్ కార్యక్రమంలో.. 279 మేగా వాట్ల విద్యుత్ను సేవ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.