NTR: తాతకు నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఆయన మనవళ్లు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాట్‌ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.