ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి రాదు: విజయసాయిరెడ్డి

బాపట్ల: జగన్‌ పాలనలో ఏపీ అభివృద్ధి చెందిందని.. కాబట్టే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో వైఎస్సార్‌సీపీ నిర్వహించబోయే సిద్ధం ముగింపు సభ ఏర్పాట్లను గురువారం సాయంత్రం పర్యవేక్షించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు.  జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికలకు సిద్ధం అయ్యాం. సిద్ధం సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మేదరమెట్ల సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మా అంచనా ప్రకారం 15 లక్షల మంది వస్తారని అనుకుంటున్నాం.  సభా ప్రాంగాణాన్ని అవసరమైతే ఇంకో 200 ఎకరాలకు పొడిగిస్తాం. ఇదే ఆఖరి సిద్ధం […]

వ్యూహం మార్చిన వైఎస్సార్‌సీపీ.. మచిలీపట్నం(బందరు) అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్‌

 కృష్ణా: మచిలీపట్నం(బందరు) లోక్‌సభ అభ్యర్థి విషయంలో వైఎస్సార్‌సీపీ వ్యూహం మార్చింది. డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌పేరును తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయమై మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు..    మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని సీఎం జగన్‌ ఆయన్ని( సింహాద్రి చంద్రశేఖర్‌) కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. అందుకే సింహాద్రి చంద్రశేఖర్‌ పేరును ప్రకటిస్తున్నాం. చంద్రశేఖర్‌ ఈ ప్రాంతానికి బాగా సుపరిచితులు. ఆయన తండ్రి కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా కూడా పని చేశారు. ఇప్పుడు చంద్రశేఖర్‌ మచిలీపట్నం […]

850 ఎకరాల స్కాం.. చంద్రబాబుకు హైకోర్టు షాక్‌!

ఆ 850 ఎకరాల భూమి రద్దు సరైనదే.. చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పు పట్టిన తెలంగాణ హైకోర్టు వైఎస్సార్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు భూముల రద్దును సవాల్ చేస్తూ బిల్లీ రావు వేసిన పిటిషన్‌ కొట్టివేస్తూ తీర్పు హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో ఓ సం‍స్థకు అక్రమంగా కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి సుధీర్ఘ కాలం తర్వాత తీర్పు వచ్చింది. 2004లో నాటి ఆపద్ధర్మ చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. […]

రేవంత్‌ సర్కార్‌ను కూల్చం.. ఐదేళ్లు ఉండాల్సిందే!: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బయటి నుంచి ఎవరో కూల్చరని.. ప్రభుత్వాన్ని పడగొట్టేవాళ్లు ఆ పార్టీలోనే ఉన్నారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కరీంనగర్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు బండి సంజయ్‌పైనా మండిపడ్డారు.  .. కరీంనగర్ నుంచే పార్లమెంట్ జంగ్ సైరన్ మోగబోతోంది. కేసీఆర్‌కు కరీంనగర్ అంటే సెంటిమెంట్. నాటి ఉద్యమ కాలాన సింహగర్జన సభకు కరీంనగరే వేదికైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనపై కూడా కదనభేరి సభ కరీంనగర్ […]

Gudivada Amarnath: ఈ ఎన్నికల్లో మంత్రి గుడివాడ పోటీ చేయనట్లేనా?…

 ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన చేయూత బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పకుంటానని స్పష్టం చేశారు. అనకాపల్లి సమన్వయకర్తగా మలసాల భరత్‌ను నియమించారని తెలిపారు. ‘‘చాలా మంది నీ పరిస్థితి ఎంటి ఎక్కడ పోటీ చేస్తావని నన్ను అడుగుతున్నారు’’ అని అన్నారు. అనకాపల్లి జిల్లా, మార్చి 7: ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం […]

AP Politics: 10 ఏళ్లు గొర్రెలు అయ్యాం.. ఇక సింహాల్లా పోరాడాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అవుతున్నా హోదా రాలేదన్నారు. పదేళ్ల నుంచి ఆంధ్రవారిని అధికార పార్టీలు గొర్రెలను చేశారని ధ్వజమెత్తారు. హోదా కోసం సింహాల మాదిరిగా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. హోదా గురించి తలచుకొని షర్మిల కన్నీటి పర్యంతం అయ్యారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  ప్రకటించారు. రాష్ట్రం విడిపోయి […]

Nara Lokesh: ఏపీలో మహిళలకు రక్షణ లేదు.. జగన్‌పై మండిపడిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మడకశిరలో మలివిడత శంఖారావం సభను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. మడకశిర: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మడకశిరలో మలివిడత శంఖారావం సభను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ పోటీ చేసేది ఎక్కడ అంటే..? ఆ రెండు చోట్లేనా..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం తేలలేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతోన్న పవన్ పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ వీడలేదు. రోజుకో కొత్త నియోజకవర్గం పేరు వినిపిస్తోంది. గత ఎన్నికల్లో బరిలోకి దిగిన గాజువాక, భీమవరం నుంచి మాత్రం పోటీ చేయరని జనసేన నేతలు చెబుతున్నారు. అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు..? ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారా..? లేదంటే ఆధ్మాత్మిక కేంద్రం నుంచి బరిలోకి దిగుతారా..? అసెంబ్లీకి […]

ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా.. ఎన్నికల్లో పోటీ?, ఆ నియోజకవర్గమేనా!

ఏపీలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. అనూహ్యంగా వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమె కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో పద్మ ఎన్నికల్లో పోటీ చేయడానికే పదవికి గుడ్ బై చెప్పారంటున్నారు. ప్రధానాంశాలు: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ […]

ఏపీ మహిళల అకౌంట్‌లలోకి డబ్బులు.. ఒక్కొక్కరికి రూ.18,750

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనకు వెళుతున్నారు. గురువారం ఆయన వైఎస్సార్‌ చేయూత పథకం కింద నాలుగో విడత నిధులను బటన్‌ నొక్కి విడుదల చేస్తారు. ముఖ్యమంత్రి గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా కశింకోట చేరుకుంటారు.. అక్కడినుంచి పిసినికాడ చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ చేయూత నాలుగో విడత నిధులను బటన్‌ నొక్కి విడుదల చేసి.. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. […]