Gaza – ఆసుపత్రి బాధితులకు మలాలా రూ.2.5 కోట్లు

గాజాలోని అల్‌ అహ్లి ఆసుపత్రిపై రాకెట్‌ దాడి జరగడంపై నోబెల్‌ పురస్కార గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ వేళ పాలస్తీనా ప్రజలకు సాయం చేస్తున్న మూడు స్వచ్ఛందసంస్థలకు తన వంతుగా 3 లక్షల డాలర్లు (రూ.2.5 కోట్లు) విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని ఆమె విడుదల చేశారు. ‘‘గాజాలోని అల్‌ – అహ్లి ఆసుపత్రిపై జరిగిన బాంబు దాడిని చూసి భయపడ్డా. ఈ చర్యను నిస్సందేహంగా […]