Bhagavanth Kesari – ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). అనిల్‌ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్ర పోషించారు. తాజాగా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో శ్రీలీలను ఉద్దేశించి బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తనని చిచ్చా చిచ్చా అంటూ టార్చర్‌ పెట్టిందని సరదాగా అన్నారు. ‘‘నా తదుపరి సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నా. అదే విషయాన్ని మా ఇంట్లో చెప్పా. ఆ మాట విని మా అబ్బాయి […]

West Bengal – సీనియర్ మంత్రి నివాసంపై సీబీఐ దాడులు

 పశ్చిమబెంగాల్‌ మంత్రి ఫిర్హద్‌ హకీం, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మదన్‌ మిత్రల గృహాల్లో ఆదివారం సీబీఐ సోదాలు నిర్వహించింది. పౌర సంస్థల్లో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో చోటు చేసుకున్న అవకతవకల ఆరోపణలపై ఈ దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాల మంత్రిగా, కోల్‌కతా మేయర్‌గా హకీం వ్యవహరిస్తున్నారు. పార్టీలో ప్రముఖనేతగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం తొమ్మిది గంటలకు హకీం ఇంట్లోకి ప్రవేశించిన సీబీఐ […]

Careers 360 – ఫ్యాకల్టీ రీసెర్చ్‌ అవార్డులు.

కెరీర్స్‌ 360 ఫ్యాకల్టీ రీసెర్చ్‌ అవార్డులు అందుకున్నారు. ఇక్కడి ప్రధానమంత్రి సంగ్రహాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయమంత్రి దేవుసిన్హ్‌ చౌహాన్‌, ఏఐసీటీఈ ఛైర్మన్‌ టీజీ సీతారాం చేతులమీదుగా ఈ అవార్డులు అందుకున్నారు. టాప్‌ 81 రీసెర్చ్‌ స్కాలర్స్‌ను ఇందుకోసం ఎంపికచేశారు. మొత్తం 27 రంగాల నుంచి వీరిని ఎంపికచేశారు. ఈ కార్యక్రమంలో కెరీర్స్‌ 360 ఛైర్మన్‌ మహేష్‌ పేరి కూడా కేంద్ర మంత్రి నుంచి అవార్డు స్వీకరించారు.

Sikkim – కుదిపేసిన తీస్తా నది ఆకస్మిక వరదల ప్రభావం

ఈశాన్య రాష్ట్రం సిక్కింను కుదిపేసిన తీస్తా నది ఆకస్మిక వరదల ప్రభావం నుంచి ప్రజలు ఇపుడిపుడే తేరుకొంటున్నారు. ఆదివారం నాటికి గుర్తించిన మృతుల సంఖ్య 32కు చేరగా, ఇంకా 122 మంది ఆచూకీ తెలియడం లేదు. వీరి కోసం ప్రత్యేక రాడార్లు, డ్రోన్లు, ఆర్మీ జాగిలాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గుర్తించిన మృతుల్లో 9 మంది ఆర్మీ జవాన్లు ఉన్నారు. రాష్ట్రానికి జీవరేఖ లాంటి జాతీయ రహదారి-10 దారుణంగా దెబ్బతిని నిరుపయోగంగా మారింది. తీస్తా నది వెంబడి […]

Ayodhya : రామాలయం జనవరిలోగా ప్రారంభం కాబోతోంది..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు మరియు జనవరిలో తెరవనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో తొలి సోలార్ సిటీగా కూడా అయోధ్య అవతరిస్తుంది. యుపి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్  ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 22న జరిగే అవకాశమున్న రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్ర ఇప్పటికే ప్రకటించిన విషయం […]

Principal – విద్యార్థినిని విచక్షణా రహితంగా కొట్టిన ఘటన.

చాంద్రాయణగుట్ట:లాల్‌దర్వాజలో, పాఠశాలకు  రాలేదన్న కారణంతో  ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థినిని విచక్షణా రహితంగా కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం లాల్‌దర్వాజకు చెందిన జె.బిందు కుమార్తె వైష్ణవి(12) వెంకట్రావు మెమోరియల్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. జులైలో తన తండ్రి ఈశ్వర్ మరణించిన తర్వాత ఆమె చాలా కృంగిపోయింది మరియు అప్పటి నుండి పాఠశాలకు హాజరు కాలేదు. తల్లి, ఇతర కుటుంబ సభ్యుల ఆమోదంతో ఈ నెల నాలుగో తేదీన వెళ్లిపోయింది. […]

Meṇḍapalli – కల్తీ ఆహారం తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు.

ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మండలం మెండపల్లిలో కల్తీ ఆహారం తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ముండే బల్వంత్ అనే గ్రామస్థుడు శుక్రవారం రాత్రి తన ఇంటిలో పిత్రమాలను జరుపుకునేందుకు స్థానికులకు విందు ఏర్పాటు చేశాడు. భోజనం చేసిన తర్వాత, కొంతమందికి అర్ధరాత్రి నుండి వికారం మరియు విరేచనాలు ఉన్నాయి. శనివారం ఉదయం కూడా ఇదే సమస్య ఎదురైన మరికొందరు 108కి ఫోన్ చేసి ఐదు అంబులెన్స్‌లతో 20 మంది రోగులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని […]

Chennuru – మంత్రి హరీశ్ రావు పర్యటించారు

చెన్నూరు: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డకౌట్‌ అవుతుందని, కాంగ్రెస్‌ రనౌట్‌,, కేసీఆర్‌ సిక్స్‌ కొడతారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చెన్నూరులో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. రూ.55 కోట్లతో నిర్మించిన 50 పడకల ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా సెంచరీ కొట్టేది కేసీఆర్ అని ఈ సందర్భంగా హరీశ్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. జేపీ నడ్డా.. తెలంగాణ కేసీఆర్ తోడయ్యారు. బీజేపీ వేసిన అడ్మిషన్ల కమిటీ […]

Russia Attack : అవ్వ-మనవడి మృతి

ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌ నగరంపై రష్యా శుక్రవారం జరిపిన క్షిపణి దాడిలో 10 సంవత్సరాల బాలుడు, అతని అవ్వ దుర్మరణం పాలయ్యారు. తెల్లవారుజామున దాడి జరిగిన వెంటనే కూలిన భవన శిథిలాల నుంచి బాలుడి మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. ఇదే దాడిలో 11 నెలల చిన్నారి సహా 30 మంది గాయపడ్డారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.

Texas, USA – హ్యూస్టన్‌లో గాంధీ మ్యూజియం

మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలియజేయడంతో పాటు ఆయన అనుసరించిన అహింసా సిద్ధాంతానికి ప్రచారం కల్పించేలా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌ నగరంలో గాంధీ మ్యూజియం అందుబాటులోకి వచ్చింది. ఇతర భవనాలకు అనుబంధంగా కాకుండా ఉత్తర అమెరికా ఖండంలో విడిగా గాంధీ మ్యూజియం ఏర్పాటుకావడం ఇదే తొలిసారి. దాని విస్తీర్ణం 13 వేల చదరపు అడుగులు. ‘ఎటర్నల్‌ గాంధీ మ్యూజియం’గా పిలుస్తున్న ఈ మ్యూజియంలోకి వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టు 15 నుంచే సందర్శకులను అనుమతిస్తున్నారు. అధికారికంగా దాని […]