గ్లోబ‌ల్‌ స్టార్ రామ్‌చరణ్ బర్త్ డే.. ‘నాయక్’ రీ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఆయ‌న న‌టించిన‌ సూపర్ డూపర్ హిట్ చిత్రం నాయక్ రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలాపాల్ నటించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా, డి.వి.వి.దానయ్య నిర్మించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఆయ‌న న‌టించిన‌ సూపర్ డూపర్ హిట్ చిత్రం నాయక్ రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన అందాల భామలు […]

ఇటలీ వెళ్లిన కల్కి

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక… ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణే, దిశా పటాని తదితరులు కీలక […]

‘లైన్‌మ్యాన్’ మూవీ ట్రైలర్

తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో త్రిగుణ్. ఇప్పుడీ హీరో ‘లైన్ మ్యాన్’ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వి రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మాండ్య ప్రాంతంలోని సమీప గ్రామాల్లోని అక్కడి వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ కామెడీ ప్రదానంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

AP Politics: 10 ఏళ్లు గొర్రెలు అయ్యాం.. ఇక సింహాల్లా పోరాడాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అవుతున్నా హోదా రాలేదన్నారు. పదేళ్ల నుంచి ఆంధ్రవారిని అధికార పార్టీలు గొర్రెలను చేశారని ధ్వజమెత్తారు. హోదా కోసం సింహాల మాదిరిగా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. హోదా గురించి తలచుకొని షర్మిల కన్నీటి పర్యంతం అయ్యారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  ప్రకటించారు. రాష్ట్రం విడిపోయి […]

Nara Lokesh: ఏపీలో మహిళలకు రక్షణ లేదు.. జగన్‌పై మండిపడిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మడకశిరలో మలివిడత శంఖారావం సభను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. మడకశిర: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మడకశిరలో మలివిడత శంఖారావం సభను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ పోటీ చేసేది ఎక్కడ అంటే..? ఆ రెండు చోట్లేనా..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం తేలలేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతోన్న పవన్ పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ వీడలేదు. రోజుకో కొత్త నియోజకవర్గం పేరు వినిపిస్తోంది. గత ఎన్నికల్లో బరిలోకి దిగిన గాజువాక, భీమవరం నుంచి మాత్రం పోటీ చేయరని జనసేన నేతలు చెబుతున్నారు. అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు..? ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారా..? లేదంటే ఆధ్మాత్మిక కేంద్రం నుంచి బరిలోకి దిగుతారా..? అసెంబ్లీకి […]

ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా.. ఎన్నికల్లో పోటీ?, ఆ నియోజకవర్గమేనా!

ఏపీలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. అనూహ్యంగా వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమె కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో పద్మ ఎన్నికల్లో పోటీ చేయడానికే పదవికి గుడ్ బై చెప్పారంటున్నారు. ప్రధానాంశాలు: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ […]

ఏపీ మహిళల అకౌంట్‌లలోకి డబ్బులు.. ఒక్కొక్కరికి రూ.18,750

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనకు వెళుతున్నారు. గురువారం ఆయన వైఎస్సార్‌ చేయూత పథకం కింద నాలుగో విడత నిధులను బటన్‌ నొక్కి విడుదల చేస్తారు. ముఖ్యమంత్రి గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా కశింకోట చేరుకుంటారు.. అక్కడినుంచి పిసినికాడ చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ చేయూత నాలుగో విడత నిధులను బటన్‌ నొక్కి విడుదల చేసి.. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. […]

మేడారం జాతరకు రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే!

మేడారం మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మేడారం జాతర ఆదాయం రూ.13,25,22,511 వచ్చింది. గతంలో కన్నా ఈసారి ఆదాయం పెరిగింది. వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్​మెంట్​బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. జాతర అనంతరం హుండీలను టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు. నాలుగురోజుల పాటు వైభవంగా సాగిన మేడారం జాతరకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఆసియాలోనే అతిపెద్ద […]

నా కొడకల్లారా.. పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకుని ఊరేగుతాం: రేవంత్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధి కోసమే ప్రధాని మోదీని కలిశానని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోతే.. మోదీని కూడా ఉతికి ఆరేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఎవరైనా ట్రై చేసినా.. నా కొడకల్లారా ఒక్కొక్కన్ని పడబెట్టి తొక్కుతామని పేగులు బయటకు తీసి మెడలేసుకుని ఊరేగుతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి.. అగ్గి కణికలై, మానవ బాంబులై.. […]