కబ్జా భూములను సరెండర్‌ చెయ్‌

మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కబ్జా చేసిన ప్రభుత్వ, అసైన్డ్, చెరువు శిఖం భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయన ను కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌ శివార్లలోని కండ్ల కోయలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మామ మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి సహా మేడ్చల్‌ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రూ.25 వేలకోట్ల విలువ చేసే ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, చెరువు శిఖం భూములను ఆక్రమించారు. […]

 విమానం గాల్లో ఉండగా ఊడిన టైరు.. వీడియో వైరల్‌

అమెరికా లోని ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా దాని టైరు ఊడిపడింది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే దారిమళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 777-200 విమానం గురువారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్‌లోని ఒసాకాకు బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే వెనుక వైపున ల్యాండింగ్‌ […]

ఆ గాయం నుంచి కోలుకోవాలంటే సమయం పడుతుంది: సమంత

సినిమాలకు విరామం ప్రకటించినప్పటికీ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు. ‘మనపై మనకున్న విశ్వాసం గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సాయపడుతుంది. నేను అభద్రతాభావానికి లోనవుతున్నానని తెలుసుకోగలిగాను. త్వరగా దాని నుంచి బయటకు వచ్చాను. బాహ్య గాయాల కంటే మనసుకైన గాయం నుంచి కోలుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుంది’ అని ఆమె ఓ మ్యాగజైన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. […]

విశ్వక్ సేన్ ‘గామి’ సినిమా ఎలా ఉందంటే…

విశ్వక్ సేన్ వైవిధ్యం వున్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అలాంటి వైవిధ్యమున్న సినిమా ‘గామి’ అని విశ్వక్, చిత్ర నిర్వాహకులు చెబుతూ వస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనపడనున్నారని ప్రచారాల్లో చెప్పారు. చాందిని చౌదరి కథానాయికగా నటించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే.. Gaami Movie Poster సినిమా:  gaami నటీనటులు: విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, శాంతి రావు, అష్రాఫ్ తదితరులు ఛాయాగ్రహణం: విశ్వనాధ్ రెడ్డి […]

చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలు: హరీష్ రావు..

సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహబూబ్‎నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టిడిపి, కాంగ్రెస్ పాలన అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలని, చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన […]

సీఎం హోదాలో తొలిసారిగా ఏపీకి రేవంత్‌.. కాంగ్రెస్ తరుఫున ప్రచారం

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా విశాఖకు వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 11న విశాఖ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉండటంతో ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబుపై రేవంత్ ఏం మాట్లాడతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా విశాఖకు వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 11న విశాఖ వేదికగా కాంగ్రెస్ […]

విశాఖ వీధుల్లో కేంద్ర బలగాలు, పోలీస్ ఫ్లాగ్ మార్చ్.. ఎందుకో తెలుసా..!

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశాఖ నగరంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కొనేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించ్చారు. రానున్న ఎన్నికల కోసం విశాఖలో పోలీసులు, కేంద్ర బలగాలు, సన్నద్ధమవుతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సాగేలా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నాకా బందీ నిర్వహించిన పోలీసులు.. కీలక పాయింట్లపై నిఘా పెట్టి […]

పవన్‌ కల్యాణ్ పోటీ చేయకపోతే టికెట్‌ వాళ్ళకే.. జనసేన నేతల హామీ!

ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. పాత పీఆర్పీ, టీడీపీ నేతలతో మంతనాలు జరుపుతూ ఎప్పటికప్పుడు పార్టీ బలమెంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బలిజలకే టికెట్ ఇవ్వాలని అది కూడా లోకల్స్ కే ఇవ్వాలని పట్టు పడుతున్న ఆ సామాజిక వర్గం పవన్‌ పోటీ చేస్తే మాత్రం ఒకే అంటుండడం ఆసక్తికరంగా మారింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. పాత పీఆర్పీ, టీడీపీ నేతలతో […]

ప్రజాపాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగింది: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. మహిళల సాధికారితతో పాటు ఆర్థిక స్వాలంబనకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ రూ.500 గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు […]

ఎమ్మెల్యే మర్రి కళాశాల భవనం కూల్చివేత

దుండిగల్‌: మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌(ఐఏఆర్‌ఈ) కళాశాల భవనాన్ని కూల్చివేశారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారంటూ ఇటీవల నోటీసులు ఇచ్చిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ కళాశాల వద్దకు చేరుకున్నారు. జేసీబీలతో ఐదు అంతస్తుల శాశ్వత భవనాన్ని కూల్చివేయడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. […]