Air India – కరాచీలో అత్యవసరంగా దిగిన విమానం

దుబాయ్‌ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వస్తున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఒకటి వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో దిగింది. విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురవడమే ఇందుకు కారణమని విమానయాన సంస్థ ప్రతినిధులు తెలిపారు. శనివారమే ఈ ఘటన చోటుచేసుకోగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ‘‘దుబాయ్‌- అమృత్‌సర్‌ విమానంలోని ఓ ప్రయాణికుడికి మార్గమధ్యలో అకస్మాత్తుగా వైద్యపరమైన సమస్యలు తలెత్తాయి. దీంతో వీలైనంత త్వరగా అతడికి వైద్య సాయం అందించేందుకుగానూ కరాచీ నగరం అత్యంత […]