Modi Tour In AP ఏపీలో మోదీ పర్యటన ఖరారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు తెదేపా-జనసేన-భాజపా ఏర్పాట్లు చేస్తున్నాయి. అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు తెదేపా-జనసేన-భాజపా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనికి హాజరు కానున్నారు. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రధాని కార్యాలయం సమాచారం […]

Seats adjustment Janasena & TDP పొత్తు ‘లెక్క’ తేలింది

తెదేపా, జనసేన, భాజపా మధ్య పొత్తు లెక్క తేలింది.  సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెదేపా 144, జనసేన 21, భాజపా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్‌సభ స్థానాల్లో తెదేపా 17, భాజపా 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి. 17 లోక్‌సభ, 144 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా పోటీభాజపాకు 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ సీట్లు2 లోక్‌సభ, 21 శాసనసభ స్థానాల్లో బరిలోకి జనసేనచంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో కేంద్ర మంత్రి షెకావత్‌, […]

Vande Bharat: వందేభారత్‌ @ 50.. సికింద్రాబాద్‌-విశాఖ మార్గంలో పట్టాలెక్కిన మరో రైలు

Vande Bharat: దేశంలో మరో 10 వందేభారత్‌ రైళ్లకు ప్రధాని మోదీ నేడు పచ్చజెండా ఊపారు. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య మరో వందేభారత్‌ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలుకు […]

Delhi Encounter: దిల్లీలో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌

Delhi Encounter: ఇటీవల ఓ వ్యక్తి హత్యకు కారణమైన హాశిమ్‌ ముఠాకు చెందిన ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్‌కౌంటర్‌ కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎదురుకాల్పుల్లో గాయపడిన వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈశాన్య దిల్లీలోని అంబేడ్కర్‌ కాలేజీ సమీపంలో రాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు పోలీసులకు సైతం […]

CM Jagan is deeply saddened by Geetanjali’s suicide | గీతాంజలి ఆత్మహత్యపై సీఎం జగన్‌ తీవ్ర విచారం.. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన ఆడబిడ్డల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే వారిని చట్టం వదిలిపెట్టదన్న సీఎం అమరావతి: తెనాలి మహిళ గీతాంజలి ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తంచేవారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం […]

India-China news : అరుణాచల్‌ మాదే.. మీ పిచ్చివాదన వాస్తవాలను మార్చదు: చైనాకు భారత్‌ చురక

ప్రధాని మోదీ ‘అరుణాచల్‌’ పర్యటనపై నోరు పారేసుకున్న చైనాకు భారత్‌ గట్టిగా బదులిచ్చింది. ‘మీ అక్కసు వాస్తవాలను మార్చలేదంటూ’ డ్రాగన్‌కు చురకలంటించింది. దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal Pradesh)లో పర్యటించడంపై చైనా (China) తన అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ‘జాంగ్‌నన్‌’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ భారత్‌ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని డ్రాగన్‌ విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ నోరుపారేసుకున్నారు. ఈ విషయమై […]

Aadhaar Update: ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరోసారి గడువు పొడిగింపు

ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగిస్తున్నట్లు ఉడాయ్‌ తెలిపింది. దిల్లీ: ఆధార్‌ (Adhaar) వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ (Free Aadhaar Update) చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి 14తో ముగియడంతో ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఉడాయ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో జూన్‌ 14 […]

PM Modi congratulated Mission Divyastra on success | మిషన్‌ దివ్యాస్త్ర విజయవంతం.. అభినందించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ విజయవంతమైంది. మిషన్‌ దివ్యాస్త్రలో భాగంగా భారత రక్షణ పరిశోధనా సంస్థ (DRDO) ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌(ఎంఐఆర్‌వీ) పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో అగ్ని-5 రేంజ్‌.. 7 వేల కిలోమీటర్లకు పైగా ఉండే అవకాశం ఉంది. మిషన్‌ దివ్యాస్త్ర విజయవంతంతో డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. […]

Criticism of the opposition on the implementation of CAA / సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే వివాదాస్పద సీఏఏ చట్టం అమలు నిర్ణయంపై మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏ చట్టాన్ని సైతం ఎన్నికల పావుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ‘2019లో సీఏఏ చట్టం చేయబడితే.. మోదీ ప్రభుత్వానికి ఆ […]

Bus Fire accident in wedding kills five people/ ఘోర ప్రమాదం..పెళ్లి బస్సులో మంటలు అయిదుగురి మృతి

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఘాజీపూర్‌ జిల్లాలో ఓ బస్సుపై హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ‍ప్రమాదంలో  అయిదుగురు మృత్యువాత పడగా.. 11 మందికి గాయాలయ్యాయి.  వివరాలు.. మౌ జిల్లా నుంచి పెళ్లి బృందం బస్సు ఘాజీపూర్‌లోని మహావీర్‌ ఆలయానికి వెళ్తోంది. బస్సు ముర్దా పట్టణంలో ఓవర్‌హెడ్‌ హైవోల్టేజీ వైర్లను తాకడంతో మంటలు చెలరేగాయి.  గమనించిన స్థానికులు పరుగెత్తుకొచ్చి బస్సుల్లో నుంచి ప్రయాణికులను రక్షించేందుకు సాయం చేశారు. మంటల్లో చిక్కుకొని నిమిషాల వ్యవధిలోనూ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మెుత్తం […]