#Ranga Reddy District

Telangana BJP-బీజేపీ 14 కమిటీలను ఏర్పాటు చేసింది…..

హైదరాబాద్:

రానున్న తెలంగాణ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి బీజేపీ 14 కమిటీలను వేసింది. ఈ కమిటీలు చైర్మన్‌, కన్వీనర్‌లను నామినేట్‌ చేశాయి. ఎన్నికల మ్యానిఫెస్టో, ప్రచార కమిటీకి వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యవహరిస్తారు. అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బహిరంగ సభలకు బండి సంజయ్, చార్జిషీట్ కమిటీకి మురళీధర్ రావు, పోరాట కమిటీకి విజయశాంతి ఎంపికయ్యారు. వీటితోపాటు పలు ఇతర కమిటీలకు నేతలను నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో ఆ పార్టీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. బీజేపీ ముఖ్య నేతలు బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్ పాల్గొన్నారు.పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రణాళికలపై చర్చిస్తున్నారు. శుక్రవారం జరిగే కౌన్సిల్ సమావేశంలో తీర్మానాలను పరిశీలించి ఆమోదించనున్నారు. ఈ కౌన్సిల్ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కౌన్సిల్ సమావేశానికి వెయ్యి మంది నేతలు హాజరుకానున్నారు. ఘట్‌కేసర్‌లోని VBIT కళాశాలలో.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *