Hyderabad – స్నేహితుల మరణం.

హైదరాబాద్:స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్తుండగా కారు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. బైక్పై వస్తుండగా వారిని వాహనం ఢీకొట్టడంతో వెంటనే మృతి చెందారు. మేడ్చల్ చెక్పోస్ట్-కిష్టాపూర్ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మృతులు మేడ్చల్ మండలం రావుకోల్ గ్రామానికి చెందిన భాను, హరికృష్ణగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు.