#National News

Two babies died – చలికి తట్టుకోలేక ఇద్దరు శిశువులు మృతి చెందారు.

ఓ వైద్యుడి నిర్లక్ష్యం ఇద్దరు నవజాత శిశువుల ప్రాణాలు బలితీసుకుంది. హాయిగా నిద్రపోవడానికి  డాక్టర్‌ ఏసీ వేసుకోగా.. ఆ చలికి తట్టుకోలేక ఇద్దరు శిశువులు మరణించారు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని శామలి జిల్లాలో జరిగింది. దీనికి కారణమైన డాక్టర్‌ నీతును పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కైరాణా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేట్‌ క్లినిక్‌కు తరలించారు. వీరిద్దరిని ఫొటోథెరపీ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇద్దరు చిన్నారులను పట్టించుకోని డాక్టర్‌ నీతు.. నిద్రపోవడానికి రాత్రంతా ఏసీని వేసుకున్నారు. ఆదివారం ఉదయాన్నే చిన్నారులను చూసేందుకు కుటుంబసభ్యులు వెళ్లేసరికి.. విగతజీవులయ్యారు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *