Rs.100 Crores – విలువైన డ్రగ్స్ స్వాధీనం

మిజోరంలోని మయన్మార్ సరిహద్దు జిల్లా చంఫాయ్లో మంగళవారం రూ.45 కోట్ల విలువైన మెథంఫెటమైన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల 12 నుంచి ఇప్పటివరకూ మొత్తం రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడినట్లు పేర్కొన్నారు. ఆయా ఘటనలకు సంబంధించి ఓ స్థానిక యువకుడితో పాటు అస్సాం, మయన్మార్కు చెందిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.