#National News

Movements- పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్తున్న

పంజాబ్‌ రాష్ట్రం లుథియానాలో చనిపోయాడనుకొని పోస్ట్‌మార్టంకు తరలిస్తున్న ఓ పోలీసు అధికారి దేహంలో కదలికలను చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. ఆయన్ను మరో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. పోలీసు అధికారి మన్‌ప్రీత్‌ను ఓ విషపురుగు కుట్టింది. సెప్టెంబరు 15న ఆయనను లుథియానాలోని బస్సీ ఆసుపత్రిలో చేర్పించారు. శరీరమంతా ఇన్‌ఫెక్షను సోకడంతో వెంటిలేటరుపై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 18 అర్ధరాత్రి మన్‌ప్రీత్‌ మృతిచెందాడని ఆస్పత్రి సిబ్బంది తెలిపారని తండ్రి రామ్‌జీ చెబుతున్నారు. మరుసటిరోజు ఉదయం పోస్ట్‌మార్టం కోసం తరలిస్తుండగా అక్కడే డ్యూటీలో ఉన్న ఓ పోలీసు అధికారి.. మన్‌ప్రీత్‌ శరీరంలో కదలికలను గుర్తించారు. వెంటనే మరో ఆసుపత్రికి తరలించగా చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, మన్‌ప్రీత్‌ చనిపోయాడని తమ సిబ్బంది ఎవరూ చెప్పలేదని బస్సీ ఆసుపత్రి వైద్యులు అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *