#National News

Avalanche tragedy – ఏడాది తర్వాత దొరికిన పర్వతారోహకుడి మృతదేహం

ఉత్తరాఖండ్‌లోని ద్రౌపదీ కా డాండా పర్వత శిఖర మార్గంలో గతేడాది అక్టోబరులో జరిగిన హిమపాత విషాదంలో మరణించిన వినయ్‌ పన్వర్‌ మృతదేహాన్ని గురువారం గుర్తించారు. 29 మంది పర్వతారోహకులను బలిగొన్న నాటి మహా విషాదంలో నెల రోజుల గాలింపు ద్వారా 27 మృతదేహాలను కనుగొన్నారు. గల్లంతైన మిగతా ఇద్దరిలో వినయ్‌ మృతదేహం కూడా దొరకడంతో, లెఫ్టినెంట్‌ కర్నల్‌ దీపక్‌ వశిష్ట్‌ ఆచూకీ ఇక తెలియాల్సి ఉంది. నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ (ఎన్‌ఐఎం) బృందం ద్రౌపదీ కా డాండాకు వెళ్లే మార్గంలో ఓ చీలిక వద్ద వినయ్‌ మృతదేహాన్ని గుర్తించి హెలికాప్టర్‌ ద్వారా తీసుకువచ్చినట్లు ఎన్‌ఐఎం రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *