Maharastra – రైలు ప్రమాదం..

మహారాష్ట్రలో ఓ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. సోమవారం మధ్యాహ్నం అహ్మద్నగర్ నారాయణ్పుర్ స్టేషన్ల మధ్య 8 బోగీల డెము రైల్లో భారీగా మంటలు చేలరేగాయి. ఐదు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం సంభవించలేదని, గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మంటలు వ్యాపించగానే రైలులో ఉన్నవారిని కిందకు దించినట్లు చెప్పారు.