YSRCP: పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైకాపా మూకలు..

ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు, కార్యకర్తల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
పిడుగురాళ్ల: ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు, కార్యకర్తల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలింగ్ తర్వాతి రోజు గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం పెద్ద అగ్రహారంలో వైకాపా మూకలు రెచ్చిపోయాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తెదేపా మద్దతుదారులపై కర్రలు, రాళ్లతో ఆ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి అండతో అరాచకం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా బయటకి వచ్చింది.