TDP PARTY : The second list of TDP candidates : మార్చి 14న టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదల.. 25 నుంచి 30 స్థానాలకు ప్రకటించే అవకాశం

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. జనసేన,బీజేపీ తో పొత్తులు ఖరారు, సెట్లో సర్దుబాటు తర్వాత మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. బీజేపీ తో పొత్తు కరారు కాకముందు జనసేనతో కలిసి ఉమ్మడిగా మొదటి పెడితే అభ్యర్థులను ప్రకటించారు మొత్తం 175 స్థానాలకు గాను మొదటి విడతలు రెండు పార్టీలు కలిసి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు..
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. జనసేన,బీజేపీ తో పొత్తులు ఖరారు, సెట్లో సర్దుబాటు తర్వాత మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. బీజేపీ తో పొత్తు కరారు కాకముందు జనసేనతో కలిసి ఉమ్మడిగా మొదటి పెడితే అభ్యర్థులను ప్రకటించారు మొత్తం 175 స్థానాలకు గాను మొదటి విడతలు రెండు పార్టీలు కలిసి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో 94 స్థానాలకు టిడిపి అభ్యర్థులను ప్రకటించగా ఐదు స్థానాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 24 అసెంబ్లీ స్థానాల్లో,3 లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత మొదటి విడత జాబితాలో సీట్లు దక్కని ఆశావహులు, సీనియర్లను పిలిచి మాట్లాడి వారికి నచ్చజెప్పి పంపించారు చంద్రబాబు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అనేక విధాలుగా సర్వేలు చేసి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు.
సీట్లు దక్కని అభ్యర్థులకు అధికారంలోకి రాగానే కచ్చితంగా ఆదుకుంటామని వారికి హామీ ఇస్తున్నారు చంద్రబాబు. ఇక టీడీపీ – జనసేన రెండు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాల్లో తీసుకున్న నిర్ణయాల పైన వారందరికీ స్పష్టత ఇస్తూ వస్తున్నారు. చంద్రబాబుతో బయటకు ముందు తమ బలాన్ని నిరూపించుకోవడానికి కొంతమంది అభ్యర్థులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ తర్వాత అధిష్టానం వద్ద మాట్లాడిన తర్వాత వారందరూ తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు చంద్రబాబు నిర్ణయమే తమకు ఫైనల్ అని చాలామంది అభ్యర్థులు క్లారిటీ ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 94 మంది అభ్యర్థులను ప్రకటించడం, నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందులను అధిగమించడంలో చంద్రబాబు చాలా వరకు సక్సెస్ అయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు. మొదటి విడత జాబితా ప్రకటన తర్వాత బీజేపీతో పొత్తులు ఖరారు కావడం ఆ తర్వాత సీట్ల సర్దుబాటు జరిగింది. దీంతో రెండో విడత జాబితాను ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.