Stone attack on CM Jagan.. : సీఎం జగన్పై రాళ్ల దాడి.. ఎడమ కంటికి తీవ్ర గాయం

విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. కొందరు అగంతకులు ముఖ్యమంత్రి పైకి రాళ్లు విసరడంతో ఆయన ఎడమ కంటి దగ్గర తీవ్ర గాయమైంది. విజయవాడ సింగ్నగర్ డాబా కోట్ల సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది

విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. కొందరు అగంతకులు ముఖ్యమంత్రి పైకి రాళ్లు విసరడంతో ఆయన ఎడమ కంటి దగ్గర తీవ్ర గాయమైంది. విజయవాడ సింగ్నగర్ డాబా కోట్ల సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తుండగా పథకం ప్రకారమే రాళ్ల దాడి జరిగిందని సమాచారం.

క్యాట్బాల్లో రాయిపెట్టి విసరడంతో రాయి వేగంగా వచ్చి జగన్ ఎడమ కనుబొమ్మకు తగిలింది. దీంతో కంటి దగ్గర వాపు వచ్చింది. వైద్యులు జగన్ కు ప్రాథమిక చికిత్స అందించారు. చికిత్స తర్వాత యధావిధిగా బస్సు యాత్ర కొనసాగుతోంది. కాగా ఈ ఘటనలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా గాయమైంది. కాగా ఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

జగన్ పై దాడి జరిగిన ప్రాంతంలో ఒకవైపు పాఠశాల, మరోవైపు రెండంతస్తుల భవనాలు ఉన్నాయి. మరోవైపు దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సీఎం జగన్కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే.. టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారంటున్న విజయవాడ YSRCP నేతలు ఆరోపిస్తున్నారు.
