Modi Tour In AP ఏపీలో మోదీ పర్యటన ఖరారు.

ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు తెదేపా-జనసేన-భాజపా ఏర్పాట్లు చేస్తున్నాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు తెదేపా-జనసేన-భాజపా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనికి హాజరు కానున్నారు. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రధాని కార్యాలయం సమాచారం పంపింది. ఈ సభ ద్వారా ఒకే వేదికపైకి మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రానున్నారు.
పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికల బహిరంగ సభ కావడంతో మూడు పార్టీలూ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. పెద్ద పార్టీగా తెదేపా ఎక్కువ బాధ్యత తీసుకుని, పెద్దఎత్తున విజయవంతం చేసేందుకు కార్యాచరణను రూపొందించింది. సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మూడు పార్టీల ముఖ్య నేతలతో 13 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాట్లపై నారా లోకేశ్ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమీక్షకు కమిటీ సభ్యులు హాజరయ్యారు.