#Medak District

Medak – 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు

నర్సాపూర్‌:నర్సాపూర్‌ భరత్‌ టికెట్‌ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతారెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గానూ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సీఎం కేసీఆర్ మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి బీఫారాలు ఇస్తారని అందరూ ఎదురుచూసి 69 మందికే దక్కడంతో నిరాశ చెందారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శ్రీశైలం యాత్రలో ఉన్నారు. ఆయన తన అనుచరులతో వెళ్లి ఆదివారం శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు.రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి పలు కార్యక్రమాల్లో నిమగ్నమై నర్సాపూర్ లో నాయకులు, కార్యకర్తలకు చేరువయ్యారు. నర్సాపూర్ అభ్యర్థి ఎంపికకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *