#Hyderabad District

Mahaganapati – మహాగణపతికి 2200 కిలోల లడ్డూ ప్రసాదం

హైదరాబాద్ : బుధవారం ఖైరతాబాద్ మహాగణపతికి లంగర్ హౌజ్ కు చెందిన వ్యాపారి జనల్లి శ్రీకాంత్ 2200 కిలోల లడ్డూలను ప్రసాదంగా సమర్పించారు. 2016 నుంచి ప్రతి సంవత్సరం గణపతికి లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అపారమైన లడ్డూల తయారీకి మూడు రోజుల సమయం పట్టిందని శ్రీకాంత్ తెలిపారు.

బుధవారం మధ్యాహ్నం క్రేన్ సహాయంతో భారీ ఊరేగింపులో గణపతికి సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు అందరికీ స్వాగతం పలికారు. భక్తులు ఈ లడ్డూను ప్రసాదంగా స్వీకరిస్తారని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *