Hyderabad – 15 లక్షల వరకు ఆస్తి నష్టం

హైదరాబాద్ :హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ వ్యాపారంలో మంటలు చెలరేగాయి. గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో సుమారు 15 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు దుకాణ యజమాని సంతోశ్ తెలిపారు.