#Crime News

Death by force – టెన్త్‌ స్టూడెంట్‌ బలవన్మరణం….

ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం ఒక విద్యార్థి తన చదువును విస్మరించేలా చేసింది. దానికి పోను పోను చింత. చివరకు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాయదుర్గంలో చోటుచేసుకుంది. PS
రేయాన్ష్ రెడ్డి (14) ఖాజాగూడ ఓక్రిడ్జ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. అతని కుటుంబం మై హోమ్ బూజాలో నివసిస్తోంది. ఈ క్రమంలో.. రేయాన్ష్ రెడ్డి జే బ్లాక్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

దీంతో రేయాన్ష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడి చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *