అతి పెద్ద గేమ్షోతో ముందుకు రానున్నా-Manchu Manoj.

కథానాయకుడు(ManchuManoj)మంచు మనోజ్ తన కెరీర్ని పునః ప్రారంభిస్తున్నారు. ఈసారి ‘సరికొత్తగా’ అంటూ ఒకవైపు సినిమాలతోనూ, మరోవైపు ఓటీటీ వేదికపైనా సందడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ర్యాంప్ ఆడిద్దాం అంటూ అతి పెద్ద గేమ్ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారాయన. ఈటీవీ విన్లో రానున్న ఆ షోకి సంబంధించిన ప్రోమోని ఇటీవలే విడుదల చేశారు. నా ప్రపంచం సినిమా… అంటూ మొదలయ్యే ప్రోమోలో మంచు మనోజ్ తన ప్రయాణాన్ని, ఆటుపోట్లని గుర్తు చేసుకుంటూనే తిరిగొస్తున్నానని అభిమానులకి తీపి కబురు చెప్పారు. ‘‘ఇన్నాళ్లూ తమ గెలుపు కోసం ఆడిన పోటీదారుల్ని, సెలెబ్రిటీల్నే చూశాం. కానీ తొలిసారి అభిమానుల్నే గెలిపించడం కోసం ఆడుతున్న సెలెబ్రిటీ గేమ్ షో ఇది. రూ.50 లక్షల బహుమతితో వస్తున్న అతి పెద్ద గేమ్ షో’’ అని ఈ షోని నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వర్గాలు తెలిపాయి.