#Andhra Politics #ANDHRA PRADESH #Elections

Minister Rajini took Rs 6.5 crore: మంత్రి రజని రూ.6.5కోట్లు తీసుకున్నారు: వైకాపా ఇన్‌ఛార్జ్‌ మల్లెల రాజేశ్‌

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా (YSRCP)లో ముసలం మొదలైంది. అక్కడ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మల్లెల రాజేశ్ నాయుడును ఎన్నికల బరి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా (YSRCP)లో ముసలం మొదలైంది. అక్కడ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మల్లెల రాజేశ్ నాయుడును ఎన్నికల బరి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి విడదల రజని, వైకాపా అధిష్ఠానం తీరుపై రాజేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి విడదల రజని తన వద్ద డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. 

‘‘మంత్రి రజని నా వద్ద రూ.6.5కోట్లు తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చెబితే రూ.3కోట్లు మాత్రమే వెనక్కి ఇప్పించారు. మిగతా డబ్బు ఇవ్వకుండా మోసం చేశారు. మర్రి రాజశేఖర్‌కు టికెట్‌ ఇస్తే మరో రూ.20కోట్లు ఖర్చు పెట్టుకుంటా. బయటవారికి ఇస్తే ఊరుకునేది లేదు. రజనీకి సత్తా ఉంటే చిలకలూరిపేటలో పోటీ చేయాలి’’ అని ఆయన సవాల్‌ విసిరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *