Congress – MIM : ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ కుదిరింది..Feroze Khan sensational comments…

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో సై అంటే సై అంటూ తలపడుతున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆ పార్టీలో చిచ్చు రేపాయి.. ఎంఐఎంతో పొత్తు కుదిరిందంటూ ఆయన బాంబు పేల్చారు..

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో సై అంటే సై అంటూ తలపడుతున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆ పార్టీలో చిచ్చు రేపాయి.. ఎంఐఎంతో పొత్తు కుదిరిందంటూ ఆయన బాంబు పేల్చారు.. అంతేకాకుండా.. ఓ అడుగు ముందుకేసి మరి.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ను గెలిపించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించిందంటూ వ్యాఖ్యానించారు.. ఇంకేముంది.. ఇంతకాలం ఉప్పు.. నిప్పులా ఉన్న పార్టీలు.. మళ్లీ ఒక్కటయ్యాయంటూ ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అటు రాజకీయాల్లో.. ఇటు నెట్టింట వైరల్ గా మారాయి..

కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్ ఏమన్నారంటే..
ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ కుదిరింది.. అసదుద్దీన్ను గెలిపించాలని హైకమాండ్ ఆదేశించిందంటూ ఫిరోజ్ ఖాన్ పేర్కొన్నారు.రేవంత్రెడ్డి కూడా ఇదే డిసైడ్ చేశారు.. మా కెప్టెన్ ఏం చెప్తే అదే చేస్తాం.. వ్యక్తిగతంగా అసదుద్దీన్తో నేను కొట్లాడుతూనే ఉంటా.. పార్టీఆదేశాల మేరకు అతన్ని గెలిపిస్తాం.. అంటూ ఫిరోజ్ఖాన్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.