‘CM Revanth Reddy as B team for BJP’.Key comments of former minister Harish Rao. ‘బీజేపీకి బీ టీమ్గా సీఎం రేవంత్ రెడ్డి’.. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..

మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.
మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డివ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే బీజేపీకి బీ టీం లీడర్లాగా మాట్లాడుతున్నట్టున్నది తప్ప.. జాతీయ కాంగ్రెస్కు రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్టు ఏ కోశానా కనిపించడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి.. ఖర్గే, రాహుల్ నాయకత్వంలో పనిచేయడం లేదని, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీకి మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మరోసారి తేటతెల్లమయిందని ఆరోపించారు. మద్యం పాలసీ కేసు విషయంలో ఇన్నాళ్లుగా తాము ఏమి చెప్తున్నామో ఇప్పుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అదే చెప్పారన్నారు. మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా మార్చుకుందని, లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని కీలక ఆరోపణలు చేశారు.
ఇప్పుడు తమ వాదననే ఏఐసీసీ కూడా బలపరిచిందని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ అనేది పూర్తిగా కల్పితమని, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెడుతున్నదని, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆరోపించినట్లు గుర్తు చేశారు. కానీ.. రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏఐసీసీ నాయకులు మాట్లాడిన దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్ జరిగిందని, అందులో నిందితులను అరెస్టు చేయడం ఆలస్యం అయ్యిందంటూ వ్యాఖ్యానిస్తున్నారని సీఎం రేవంత్పై మండిపడ్డారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదని, ఆర్ఎస్ఎస్ భావజాలం నిండి ఉన్న మోదీ మనిషి అని చురకలంటించారు. సీఎం రేవంత్ కాంగ్రెస్లో ఉన్న విషయం మర్చిపోయి.. కేవలం బీఆర్ఎస్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకొని తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.