#Movies #Top Stories

 ఓటీటీ కన్నా ముందే.. టీవీలో!

సంక్రాంతి బరి సూపర్‌హిట్‌గా నిలిచి దాదాపు రూ.330 కోట్ల వసూళ్లు రాబట్టిన ‘హనుమాన్’ చిత్రం ఓటీటీ విడుదల కోసం ప్రేక్షుకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సంక్రాంతి బరి సూపర్‌హిట్‌గా నిలిచి దాదాపు రూ.330 కోట్ల వసూళ్లు రాబట్టిన ‘హనుమాన్’ చిత్రం ఓటీటీ విడుదల కోసం ప్రేక్షుకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. సినిమా విడుదలై వారాలు దాటుతున్నా థియేటర్స్‌లో ఆదరణ బావుండటం వల్ల ఓటీటీ విడుదలను వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఓటీటీ కన్నా ముందు టీవీలో ప్రసారం కానుందీ సినిమా. మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ ఛానెల్‌, జియో సినిమాలో కేవలం హిందీలో టెలికాస్ట్‌ అవుతుంది. ఈ వివరాలను కలర్స్‌ సినీప్లెక్స్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దాన్ని రీట్వీట్‌ చేయడంతో అధికారికంగా ప్రకటించినట్లైంది.

అయితే మార్చి 2 నుంచి ‘జీ 5’లో ‘హనుమాన్‌’ స్ట్రీమింగ్  ఆవుతుందంటూ కొన్ని రోజులు ప్రచారం జరిగింది. తర్వాత, మార్చి 8న అని టాక్‌ వినిపించింది. దీంతో, కొందరు అభిమానులు సోషల్‌ మీడియాలో ‘జీ5’ సంస్థ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ఈ సినిమా ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు.. దీనిపై స్పందించిన సదరు సంస్థ విడుదల తేదీపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *