#Telangan Politics

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా.. పరిశీలనలో పేర్లు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పరిశీలనలో ఉన్న పేర్లను అధిష్టానానికి అందజేసినట్లు తెలుస్తోంది.

ప్రధానాంశాలు:

  • ఎంపీ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్
  • ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం
  • పరిశీనలో ఉన్న పేర్లను అధిష్టానానికి ఇచ్చేశారా!
  • తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది. ఎంపీలుగా పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ఫోకస్ పెట్టింది. కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ ఢిల్లీలో సమావేశం కాబోతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ భేటీలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని పొల్గొంటారు. తెలంగాణ, కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై సీఈసీ చర్చించనుంది. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ జాబితాను తెలంగాణ పీసీసీ.. సీఈసీకి పంపించింది.

కాంగ్రెస్ పార్టీ సీఈసీ పరిశీలనలో ఈ పేర్లు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్: ఫిరోజ్ ఖాన్
సికింద్రాబాద్ : బొంతు రామ్మోహన్
మెదక్ : నీలం మధు
చేవెళ్ల : సునీత మహేందర్ రెడ్డి
నల్గొండ : జానారెడ్డి
భువనగిరి : చామల కిరణ్ కుమార్ రెడ్డి
మహబూబ్‌గర్: వంశీచంద్ రెడ్డి
నాగర్ కర్నూల్ : మల్లు రవి/ సంపత్ కుమార్
జహీరాబాద్ : సురేష్ శెట్కార్
ఖమ్మం : నందిని/ ప్రసాద్ రెడ్డి/ యుగంధర్
వరంగల్ : అద్దంకి దయాకర్ /సర్వే సత్యనారాయణ
మహబూబాబాద్ : బలరాం నాయక్
కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి
నిజామాబాద్ : జీవన్ రెడ్డి
పెద్దపల్లి : గడ్డం వంశీకృష్ణ

పైన తెలిపిన పేర్లు తెరపైకి మాత్రమే వచ్చాయి.. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థలు జాబితాను విడుదల చేయాల్సి ఉంది. త్వరలోనే అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేసి.. అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *