Attack – గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్…

గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ శుక్రవారం మరో భారీ దాడికి పాల్పడింది. గాజాలో ప్రధాన ఆసుపత్రి అల్-షిఫా ప్రాంగణంపై రాకెట్లను ప్రయోగించింది. దీంతో అంబులెన్సు వాహనశ్రేణి ఛిద్రమయింది. ఈ దాడిలో భారీ సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్యశాఖ వర్గాలు ప్రకటించాయి. అంబులెన్సుల బయట చాలా మృత దేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయని ఏఎఫ్పీ పాత్రికేయుడు ఒకరు తెలిపారు. ఇందులో మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. అయితే అల్ షిఫా ఆసుపత్రి ప్రాంగణంలోనే హమాస్ ప్రధాన స్థావరం ఉందని ఇజ్రాయెల్ చాన్నాళ్లుగా ప్రకటిస్తూ వస్తోంది.