Bangladesh – బంగ్లాదేశ్ ప్రధాని కుమార్తెకు డబ్ల్యూహెచ్ఓలో కీలక పదవి….

ఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ ఆగ్నేయాసియాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తదుపరి రీజినల్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. ఈ స్థానానికి నేపాల్ అభ్యర్థులు శంబు ప్రసాద్ ఆచార్య, సైమా వాజెద్ పోటీ చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ప్రాంతీయ కమిటీ సమావేశంలో దీనిపై ఓటింగ్ జరిగింది. ఆచార్యకు రెండు, వాజెద్కు ఎనిమిది ఓట్లు వచ్చాయి. ఈ ప్రాంతీయ కమిటీలో బంగ్లాదేశ్, నేపాల్, ఇండియా, భూటాన్, ఉత్తర కొరియా, ఇండోనేషియా, మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, థాయ్లాండ్ మరియు తైమూర్ లెస్టె సభ్యులు ఉన్నారు.