Mahabubnagar – బాబు ఈజ్ బ్యాక్ అంటూ తెదేపా నాయకుల సంబరాలు

అలంపూర్:టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆలంపూర్ నగర కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఆంజనేయులు, ముజీబ్, మద్దిలేటి, చంద్రశేఖర్ నాయుడు, విశ్వం, భాస్కర్ అందరూ ‘బాబు ఈజ్ బ్యాక్’ అంటూ కేకలు వేయడంతో ఆనందాన్ని ప్రదర్శించారు.