#Adilabad District

Adilabad – ఎన్నికలను బహిష్కరిస్తున్నాము

కడెం:తమ ఊరికి రోడ్డు సౌకర్యం పెంచేందుకు చర్యలు తీసుకునే వరకు ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ మా గ్రామాన్ని సందర్శించకూడదు. ఇటీవల గంగాపూర్, రాణిగూడ, కొర్రతండా పంచాయతీల వాసులు, నాయకులు గ్రామం వెలుపల సమావేశమై రోడ్డు సమస్య పరిష్కరించే వరకు ప్రభుత్వ ఉద్యోగులను రానీయకుండా అడ్డుకుంటామని ప్రతిజ్ఞ చేసినట్లు సమాచారం. మంగళవారం ఎన్నికల విధుల్లో భాగంగా తహసీల్దార్ రాజేశ్వరి తన బృందంతో కలిసి గ్రామాల్లో పోలింగ్ స్థలాలను పరిశీలించేందుకు వెళ్లగా ప్రజలు అడ్డుకున్నారు. రోడ్డు సమస్య, కడెం నదిపై వంతెన నిర్మాణం చేపట్టేంత వరకు ఏ అధికారి కూడా గ్రామంలోకి రాకూడదని నిర్ణయించారు.  ఎన్నికల విధుల్లో భాగంగా వచ్చామని తహసీల్దార్‌ తెలుపగా ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని అలాంటి ఏర్పాట్లేవీ అవసరం లేదని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *