‘Aadipurush’ – ఎన్నో వివాదాలను ఎదుర్కొంది

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో పాత్రల వేషధారణ మొదలుకొని సన్నివేశాల్లో వాడిన భాష, చిత్రీకరించిన ప్రదేశాలపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఈ సినిమాపై కొందరు కోర్టుకెక్కారు. మనోభావాలను పట్టించుకోకుండా పురాణాలను అపహాస్యం చేశారంటూ వివిధ హైకోర్టుల్లో నిర్మాతలపై పలు కేసులు పెట్టారు. తాజాగా వాటన్నింటినీ కొట్టేస్తూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. ‘ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చాక.. ఇక ఏ విషయంలోనూ విచారణలు అవసరం లేదు. వీటికి ముగింపు పలకండి’ అని పేర్కొంది. దీనిపై వివిధ కోర్టుల్లో జరుగుతున్న వాదనలన్నీ వ్యర్థమైనవని కోర్టు అభిప్రాయపడింది. అవన్నీ అనవసరమైన విచారణలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యానించారు.