Nagarjuna – వందో సినిమా సన్నాహాలు

నాగార్జున ప్రస్తుతం ‘నా సామిరంగ’ చిత్రంతో సెట్స్పై తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆయనకిది 99వ సినిమా. ఇది పూర్తయ్యేలోపే 100వ సినిమాపై స్పష్టత ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సరైన కథ వెతికి పట్టుకునే పనిలో పడ్డారు. నిజానికి ఈ వందో చిత్రం కోసం మోహన్ రాజా కథ సిద్ధం చేశారని.. దీంట్లో నాగ్, అఖిల్ కలిసి నటిస్తారని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ కోసం నవీన్ అనే తమిళ దర్శకుడి పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయినట్లు తెలిసింది. నాగ్ నుంచి తుది ఆమోదం రాగానే సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. దీన్ని జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నట్లు సమాచారం.