#Nirmal District

Lunch workers-ర్యాలీలో మధ్యాహ్న భోజన కార్మికులు

నిర్మల్‌చైన్‌గేట్‌ : అధిక వేతనం, బకాయిలు విడుదల చేయాలని అఖిల భారత ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు భూక్య రమేష్ మాట్లాడుతూ కార్మికులకు గుర్తింపు కార్డులతో పాటు ఉపాధి భద్రత కల్పించాలన్నారు. నిత్యావసరాల ధర ప్రకారం ఒక్కో విద్యార్థికి 25 రూపాయల చొప్పున ప్రభుత్వం అందించాలని, కోడి గుడ్లు, సిలిండర్ గ్యాస్, నిత్యావసర సరుకులు కూడా అందించాలన్నారు. పాఠశాలలో వంట గదులు, వంట షెడ్లు రెండూ లేవని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన ఉద్యోగులను తప్పుగా తొలగించడాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతినెలా ఐదో తేదీన జీతాలు, బిల్లుల చెల్లింపులు జరపాలని పట్టుబట్టారు. జిల్లా కార్యక్రమ నాయకులు అమృత, పావని, ఉమ, మైసవ్వ, లక్ష్మి, సాయవ్వ, కవిత, ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *